Tuesday, February 1, 2011

అణుయుద్ధం

"అణుయుద్ధం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న పదం. అత్యంత శక్తివంతం ఐన America నుంచి... అల్పమైన zimbambwe వరకు ప్రతి ఒక్కరిని బయకంపితులని  చేస్తున్నది......."
         ఒకరోజు నేను ఆఫీసు లో తీరిక లేకుండా టైం ని ఎలా వేస్ట్ చేయలా అని ఆలోచిస్తున్న టైం లో నాకు ఒక మెయిల్ వచ్చింది... నా స్నేహితుడి దెగ్గర నుంచి... మనం బిజీగా ఉండటం వల్ల దాన్ని మల్లి చదవచ్చులే అని, పర్సనల్ ఫోల్డర్ లో పెట్టాను. మీరు పప్పులో కాలు వేయకముందే చెప్పేస్తాను లెండి...మా మేనేజర్ పక్కనే ఉండటం వల్ల, అప్పుడు చదవకుండా వాడు లేనపుడు చూద్దాంలే అని... మూవ్ చేశాను. అది సంగతి...!!   
        సమయం: సాయంత్రం 5 గంటలు , మా చెండశాసనుడు వెళ్లి పోయాక మా కొలీగ్ పంపిన మెయిల్ ఓపెన్ చేశాను.  ఆ మెయిల్ చదవమని వాడు ఒకటే నస. నాకు తప్పలేదు ఇగ. చదువుతూ పోతుంటే ఒకటే నవ్వు నాకు .. పొట్ట చెక్కలు అయ్యేలా..... ... కట్ చేస్తే ప్రెసెంట్ టైం ...మొదటి టప రాసేశాం... రెండవ టప రాయాలని ఒకటే ఆలోచిస్తుంటే ..!! అపుడు గుర్తుకు వచ్చింది నేను చదివిన ఆ మెయిల్ గురించి... సో అనుకున్న ఇగ..!  ఆ మెయిల్ నే ఒక టపాల రాసుకొని నా బ్లాగ్ లో స్టోర్ చేసుకుందాం అని... ఎవరో రాసారో ఈ షార్ట్ స్టొరీ కాని... బలే గా ఉంది అండి.... సరిగ్గా రాసారు... వాళ్ళు ఎవరు ఐన వాళ్ళకి నేను అంతగా నవ్వేల చేసినందుకు కృతజ్ఞతలు... సరే మనం ఇంగ టప మొదలెడదాం.... ..
                  " రేయ్.... అనుదీప్...అనుదీప్...
                  ఎవడ్రా అది టప రాద్దాం అనుకుంటే ఒకటే కేకలు వేస్తున్నాడు.. వెనక్కి తిరిగి చూస్తే  ఇంకెవరు....ది గ్రేట్ పాండు....హాఊ.. హాఊ.. హాఊ...!!
             నేను- "ఏంట్రా..."
             పాండు- " ఏంటిరా..? ఏం పీకిన్గ్స్.."
              నేను- " రెండవ టప రాస్తున్నారా....!!... అదే నేను 6 నెలల క్రితం వేణు పంపిన మెయిల్ ఉంది కదరా.. అది తెలుగు లో తర్జుమా చేసి నా బ్లాగ్ లో పెట్టుకుందాం ఎప్పటికి...అని... నాకు బాగా  నచ్చిందిరా.. ఆ మెయిల్ .. నీకు ఫార్వార్డ్ చేశాను కదా... అదేరా అణుయుద్ధం గురించి... అది..."
             పాండు- " ఓసదా.. గుర్హ్టు వచ్చింది..హా బాగుందిరా... నేను కూడా మస్తు నవ్వుకున్నాలే తీయ్.. 
                           రేయ్... రేయ్... నేను రాస్తానురా ఇది... నాకు ఆ భాగ్యం ఇవ్వు.. ప్లీజ్.." 
              నేను-   " ఏంటి నువ్వా...? మతి గాని పోయింది ఏంటిరా?... నీకు లవలేశమంతఐన జ్ఞానం లేదు నువ్వు ఎం రాస్తావ్... చల్ దోబ్బెయ్...."
             పాండు- " రేయ్.. అది కాదురా.. జస్ట్ తర్జుమానే కదా... నాకు వదిలేయ్... బాన్చాత్... నేను చూసుకుంటాను.."
              నేను-  " నువ్వు...తర్జుమా?   నా బొంద బాన్చాత్...తాజ్ మహల్ గురించి చెప్పరా అంటే కాస్త కామెడీగా ఎం చెప్పవో గుర్తు ఉందా నువ్వు లాస్ట్ టైం .?"
             పాండు- " ఓ ఎందుకు గుర్తు లేదు...కావాలి అంటే మల్లి చెపుతాను విను.. ` తాజ్ మహల్ చిత్రపటం కెళ్ళి చూపిస్తూ.. `   అదే చారిత్రాత్మక తాజ్ మహల్ కట్టడము... క్రి.శ. 1957 లో తాజ్ మహల్ టీ పొడి కంపనీ వాళ్ళు పుబ్లిసిటీ కోసం దాన్ని కట్టించారు....   అప్పుడు నువ్వు కూడా అన్నావ్ కదరా.. నన్ను పొగుడుతూ.. "రేయ్.. పాండు... చీకటి నిండిన నా జీవితంలో వేయి సిగరెట్ ల వెలుగు వెలిగించి నావు ".. అని..
              నేను-  చేసావులే పిడక... ఎదవ పింజారి పేస్ నువ్వును... ఇది నా బ్లాగ్.. నేను ఒప్పుకోను నువ్వు రాయటానికి...
              పాండు- రేయ్ అది కాదు రా ... ప్లీజ్.. బ్లాగ్ స్టార్ట్ చేసేటపుడు నాది వాటా ఉంది అని ప్రామిస్ చేసావ్ ప్లీజ్ రా..! నాకు అవకాశం ఇవ్వు ప్లీజ్...
              నేను-- సరే తగలడు.. ఎం చేస్తాం కర్మ...మాట ఇట్చన్ కదా కానివ్వు... ఓకే..!మిత్రులారా.. జర ఇనుండ్రి...
              పాండు-- థాంక్స్ రా...    సబకి నమస్కారం..
              నేను- సబ ఏంటిరా ?పింగళి వెంగలప్ప... ఇది బ్లాగ్.. ఇక్కడ రాయటమే ఉంటది... సొల్లు స్పీచ్ కాదు..
              పాండు- " ఓ సారీ ! అందరికి మంగిడీలు.. పరిచయం అవసరం లేని వ్యక్తిని నేను .. ఆల్రెడీ నా గురించి మొదటి టప లో ఉంది.. సో డైరెక్ట్ ఎటాక్ ఇగ..
                            అప్పుడు ప్రపంచం అంత ఒకరంటే ఒకరు ద్వేషంతో... పగతో బ్రతుకుతున్న రోజులు..అసూయ, అస్ప్రుహ తప్ప ప్రేమ, స్నేహం అనే పదాలకి అర్ధం లేదు.. అలాంటి రోజుల్లో ... అలా దేశాలు ఉన్నపుడు మొదటగా వచ్చే పేర్లు... AMERICA అండ్ RUSSIA ...
                            ఒకవేళ అమెరికా తన అణుఆయుదాన్ని...రష్యా మీదకి లాంచ్ చేస్తే ... శాటిలైట్ టెక్నాలజీ తో ఆ విషయాన్నీ ముందుగానే పసిగట్టి అమెరికా ఎత్తుకి పై ఎత్తు వేసి కౌంటర్ ఎటాక్ చేస్తుంది... ఇది వాళ్ళ ఇదరి మధ్య ఉన్న సంగతి... ఇలాంటి పరిస్థితే అస్మదీయులు, తస్మదీయులు ఆయన హిందుస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్యలో ఎలా ఉంటుందో చూద్దాం...
                           పాకిస్తాన్ ఆర్మీ ఎలాగ ఐన న్యూక్లియర్ మిస్సైల్ ని లాంచ్ చేయాలి అని డిసైడ్ అవుతది... దీనికి వారికి ఎలాగో పాకిస్తాన్ GOVT పర్మిషన్ తో పని లేదు కనుక కౌంట్ డౌన్ స్టార్ట్ చేయమని ఆర్మీ చీఫ్ ఆర్డర్ పాస్ చేస్తాడు... మన ఇండియాధీ  చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ... వాళ్ళు కౌంట్ డౌన్  స్టార్ట్ చేయాలి అని అనుకునే దానికి 8 సెకన్ల ముందే తెలిసిపోతుంది... --అది ఎలాగా అని ప్లీజ్ అడగద్దు....
 ఇండియన్ ఆర్మీ కౌంటర్ ఎటాక్ గా తన మిస్సైల్ లాంచ్ చేయాలని అనుకుంటుంది... ఎమ్మటే ప్రెసిడెంట్ అఫ్ ఇండియా కి పర్మిషన్ కోసం ఆర్జీ పెడుతుంది.. ప్రెసిడెంట్, ఆమోదం కోసం మంత్రిమండలి కి పంపిస్తారు..
ప్రధానమంత్రి ... అన్ని పార్టీల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని ఒక్క ముక్క లో EMERGENCY గా వివరించి సభ ఆమోదం కోసం జీఓ 777 ని ప్రవేశ పెడతారు  .. కుంభకోణం గురించి మాట్లాడుతారు అనుకోని ముందుగా తయరు చేసిన పేపర్ వర్క్ తో లోఖ్ సభ కు వచ్చిన ప్రతిపక్షాలు,మిత్ర పక్షాలు విస్తుపోయి ... ముందు ప్రేపరేషన్ లేని టాపిక్ అవ్వటం వల్ల, ఎం మాట్లాడాలో అర్ధంకాక... ఈ  జీవో ని నిరసిస్తూ,ఖండిస్తూ, పోడియం వధకు దూసుకు పోయి రచ్చ, రచ్చ చేస్తే.. ఎం చేయాలో అర్ధం కాని స్పీకర్, సభని 5 నిముషాలు వాయిదా వేస్తారు ... 5 నిమిషాల్లో కూడా ఏమి ప్రిపర్ కాని అన్ని పక్షాలు, సభ నుంచి  వాక్ అవుట్  చేస్తాయి..     
                       ఇది అంత ఆల్-బాజీర చానల్ లో లైవ్  చూస్తున్న పాకిశ్తాన్ ఆర్మీ తనలో తాను నవ్వుకుంటు, మిస్సైల్ లాంచ్ చేయటానికి ట్రై చేస్తుంది.. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ లాంచ్ ఆగిపోతుంది ఐన తన తదుపరి ఎటాక్ కోసం ఆ బగ్ ఫిక్స్ చేసే ప్రయత్నా లో మునిగిపోతుంది..  ఈలోపు రూలింగ్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న మైనారిటీ పార్టీలు తమ సపోర్ట్ ని, ఉపసంహరించుకున్టై ... ఇదే అదనుగా  ప్రతిపక్షాలు కుంభ కోణాలు అవి ఇవి అని మీడియాతో చేతులు కలిపి  SITUATION ని DEVIATE చేసి GOVT పడిపోయేలా చేస్తాయి.. బల పరీక్షా లో నిరుపిన్చుకోలేకపోయన రులింగ్ పార్టీ మళ్లీ ఎన్నికలకు తెర దించుతుంది.. ఇక తప్పక రంగం లోకి దిగిన ప్రసిడెంట్, ఎన్నికలకు టైం లేదని , తాత్కాలిక ప్రభుత్వాని ఏర్పాటు చేసి పరిస్థితి అదుపులో వచ్చేలా చేయమని ఆదేశిస్తారు.. 
                    ఆ విధంగా.. ఏర్పాటు ఐన తాత్కాలిక ప్రభుత్వం.. న్యుక్లీయర్ మిస్సిల్ లాంచ్ కి ఆమోద ముద్ర వేస్తుంది... ఇది తెలిసిన ఎలక్షన్ కమీషన్, మిస్సైల్ లాంచ్ ని తక్షణమే ఆపి వేయాలని ఆదేశిస్తుంది.. ఎందుకు అంటే తాత్కాలిక ప్రభుత్వానికి ఆ అధికారం లేదు అని..  దీనితో ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో ఆర్జీ పెట్టుకుంటుంది..  అప్పుడు సుప్రీం కోర్ట్ రంగం లోకి దిగి , ఈ అత్యవసర పరిస్థితిలో ఈ ప్రభుత్వానికి నిర్ణయం తీసుకనే అధికారం  ఉంది అని తీర్పు ఇచ్చి.  ఎలక్షన్ కమీషన్ కి అక్షింతలు వేస్తుంది.. ఇది అంత ఆల్-బాజీర ఛానల్ లో చూస్తున్న పాకిస్తాన్ ఈ సరి మిస్సైల్ ని సక్సెస్ ఫుల్ గా TAKEOFF చేస్తుందిగాని.. గమ్య నిర్ధారణ లో పొరపాటు వల్ల తన దేశ రక్షణ శాక కార్యాలయం మీదనే ఉదయం 11 గంటలకు పడి పూర్తిగా ద్వంసం అవుతుంది.. లక్కీ గా  ఆ రోజు అంత త్వరగా ఎవరు రాకపోవటం వల్ల ఆస్తి నష్టం తప్ప ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా తప్పించుకుంటుంది... ఇలా జరిగినా  మళ్లీ తన నెక్స్ట్ మిస్సైల్ లాంచ్ కి ఏర్పాట్లు మొదలు పెడుతుంది..  ఈసారి USA , CHINA నుంచి బెటర్ టెక్నాలజీ ని ట్రై చేయటానికి ప్రయత్నిస్తుంది... 
                యుద్ధ నిర్ణయాధికారం వచ్చిన కొత్త ప్రభుత్వం జీఓ  777 పాస్ చేయాలని, అన్ని పార్టీ ల మీటింగ్ కి ఏర్పాట్లు చేసి మీటింగ్ కి ముందు.. తెలివిగా లగాన్ అండ్ చక్ దే ఇండియా సినిమాలు చూపించి, వాళ్ళలో దేశ భక్తి ని ప్రోది గొల్పి. ఆమోద ముద్ర వేయిన్చుకుంటుంది.. ఆ విధంగా ౩ నెలల నిరీక్షణ అనంతరం లభించిన పర్మిషన్ తో ఇండియన్ ఆర్మీ న్యూక్లియర్ మిస్సైల్ లాంచ్ కి సన్నాహాలు స్టార్ట్ చేస్తుంది... ఇది తెలిసన మానవ హక్కుల సంఘం , అణు ఆయుధ వ్యతిరేక సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ.రాస్తా రోకో లు చేయటం, PM దిష్టి బొమ్మను దగ్ధం చేయటం లాంటివి కానిచ్చి , భారత్ బంద్ ప్రకటిస్తాయ్. అంతే కాకుండా వాషింగ్టన్ , కాలిఫోర్నియా లో ఉన్న వేలాది ఇండియన్స్ కి  ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఆమోద యోగ్యం కాని ఈ చర్య గురించి, ఈ మెయిల్స్ కుప్పలు తెప్పలు గా పోతాయి. సో కథ మళ్లీ మొదటికి వెళ్లి  మిస్సైల్ లాంచ్ ఆగిపోతుంది. 
              ఇగ ఒకసారి పాకిస్తాన్ విషయానికి వస్తే , ఒకేసారి అమెరియా అండ్ చైనా టెక్నాలజీ యూస్ చేయటం వల్ల మిస్సైల్ లో మాల్ ఫన్షనింగ్ జరిగి, మిస్సైల్ రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఒరిస్సా, బీహార్ లను ధాటి బంగాళఖాతం లో పడి వేలాది చేపలని చంపుతాయి... ఆ విధం గా సముద్ర జాలర్లకి శ్రమ తగ్గిస్తాయి...  అమెరికా అండ్ చైనా టెక్నాలజీ ఒకేసారి యూస్ చేయటం వల్ల ఫెయిల్ అయింది అని భావించి , ఈసారి ఏకం గా USA మిస్సైల్ నే స్మగల్ చేసి ఆపరేట్ చేయటానికి ట్రై చేస్తారు.. అమెరికా సాఫ్ట్ వేర్ అర్ధం కాక , ఏమి మార్పులు చేయకుండా లాంచ్ చేస్తారు.. అది వెళ్లి తన ఒరిజినల్ టార్గెట్ ఐన రష్యా తీరం వైపు దూసుకుపోతుంది..  రష్యా కౌంటర్ ఎటాక్ తో ఆ మిస్సైల్ కి చెక్ పెట్టి ఆ పైన ఇంకొక మిస్సైల్ లాంచ్ చేస్తుంది.  సక్సెస్ ఫుల్ గా .... దానితో ఇస్లామాబాద్ దెబ్బకి డా.. !!               
ఇస్లామాబాద్ ని కోల్పోయిన పాకిస్తాన్ సహాయం కోసం ప్రపంచ దేశాలని ఆశ్ర ఇస్తుంది... ఇండియా తన ప్రగాడ సానుభూతి తెలుపుతూ.. వాళ్ళ కోసం కొన్ని లక్షల్లో PARLE - G బిస్కెట్ లు పంపింది. 

ఫైనల్ గా  విషయం ఏంటి అంటే...

            " ఇండియాకి  ఎప్పటికి మిస్సైల్ ని లాంచ్ చేసే చాన్సు రాదు..
               పాకిస్తాన్ ఎప్పటికి సక్సెస్ ఫుల్ గా మిస్సైల్ ఆపరేట్ చేయలేదు....."