Friday, April 22, 2011

ఘోష

                           "ఏ దేశ చరిత్ర చుసిన ఏమున్నది గర్వకారణం.
                            నరజాతి చరిత్ర సమస్థం పరపీడన పారాయణత్వం "
 ఏ ముహూర్తాన అన్నారోగాని మహాకవి శ్రీశ్రీ .... ఇది అక్షరాల నిజమేమో..... 
ఎటు పోతుంది మన దేశం..  కుంభకోణాలు..అంతర్గత కలహాలు... మత చాంధసవాధం... వర్గ తారతమ్యాలు... అవినీతి... ఇది మన 120 కోట్ల జన సాంద్రత కలిగిన మన దేశం పరిస్థితి... ఇలాంటి వాటితో ఇంకా ఎన్నాళ్ళు.................

        గాంధి కలలుకన్న స్వరాజ్యం ఇదేనా..?
        విశ్వకవి రవీంద్రుని... గీతాంజలికి ప్రతిరూపం ఇదేనా?
        రాజకీయం అనే పదానికి కొత్త అర్థాని ఇచ్చారు.. మన అమాత్యులు.. 
రా అంటే రాక్షసంగా జ అంటే జనాన్ని కి అంటే కీడుచేసే యం అంటే యంత్రాంగం అని...
సరిగ్గా రాసారు పరుచూరి బ్రదర్స్.... బహుశా ఇది మన అమాత్యుల ఆగడాలు చూసి రాసి ఉంటారు.. 
పరిపాలన వ్యవస్థ , అస్తవ్యస్తంగా తాయారు అయినది.. ఒకటి, రెండు కోట్లకు అమ్ముడు అయ్యే మంత్రులు.. విధాన సభ అమాత్యులు...
వీరా..! రాష్ట్ర నిర్దేశం ఆ పైన దేశ నిర్దేశం చేసేది...  దేశ భవితకు మార్గం చూపాల్సిన నాయకులే, ఇలా భవితని తుంగలో తొక్కుతుంటే... ఏమైపోతుంది మన దేశం.. ?

         గాంధీ గారు... విశ్వ కవి లేకపోవటం మంచిది అయింది ఏమో ?.. లేకపోతే ఈ కుళ్ళు చూడలేక దేశానికి ఎందుకు స్వేచ్చని తెచ్చాం అని భాధపడెవారేమొ..!!
ఒక రాష్ట్రానికి ఎన్నికలు వస్తే ఎందుకు ఇంత కరప్షన్...... ఎక్కడ నుంచి వస్తుంది... ఇంత మనీ...? కొంత మంది వ్యాపారస్థులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ ఫండ్ పేరిట ఎంతో డబ్బుని పార్టీలకి అప్పజెప్పి జనాలకు డబ్బు, మద్యం పంచుతున్నారు... నా అనుభవంలో నేను స్వయంగా చూసాను.. కిందటి సారి ఎన్నికలప్పుడు తాపీ పని లేదా కూలి పనిచేసే కూలీలు నాయకులు ఇచ్చే నూటపది రూపయల కోసం కూలి పని మానేశారు... రెండు గంటలు జై అని చెప్పి నాలుగు వీధులు తిరిగితే చాలు... ఒక రోజు కూలి మందం డబ్బులు వచ్చేస్తాయ్... ఇంకా ఎందుకు కూలిపనికి  పోవటం అని ప్రతి ఒక్కరు అందులోని సుఖం ఎతుకున్టున్నారు... ఎలా ఇలా ప్రజలు ఉంటె...?
బడా బిజినెస్స్ పీపుల్ ఇచ్చిన ఆ డబ్బు ని జనాలకి పంచి ఓట్లు వేయించుకుంటున్నారు..  అలా ఆ డబ్బులతో గెలిచిన పార్టీ లు అలంటి వ్యాపారస్తులకి కొమ్ము కాస్తూ వారికి అనుకూలంగా రాజ్యాంగ సవరణలు.. కాంట్రాక్టులు
ఆఖరికి సత్యం చెప్పవలిసిన దిన పత్రికలూ కూడా నోటు కి అమ్ముడుపోతే, ప్రజాస్వామ్యం కూడా ఆ నోటు మీదనే నడుస్తుంది. 
                "నోటుకి వోటు అమ్ముడుపోతే ఈ నాయకులు కోట్లకి కోట్లు కూడబెట్టుకుంటారు..."
నోటుతో ఓటు కొనుకున్న నాయకులు విధానసభ, విధానాలనే సవరిస్తున్నారు..  ఎన్ని వత్సరాలు అయింది ప్రజల సమస్యలు చర్చించి.. దానికి కావాల్సిన చట్టం అమలు అయ్యి...? బిల్ పాస్ అవటం జరిగి?
శ్రీశ్రీ గారు ఒక పాటలో ఇలా రాసారు..
" స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపదిపోగానే సరిపోదోయి.. " ఇప్పటి పరిస్థితి చూస్తే నాకు అలానే ఉంది.
 దేశం మనదే కాకపోతే మనవాళ్ళే పరాయి వాళ్ళలాగ అయ్పోయారు...
ఎక్కడిదాకో ఎందుకు మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఎంత డబ్బు ఏరులు అయి పారింది?
ఒక్కొక్క విద్యార్ధికి ఒక లాప్టాప్ ఉచితం అని ఒక పార్టీ ప్రకటిస్తే.. ఇంకొక పార్టీ ఆడపడుచులకి నాలుగు గ్రాముల  బంగారం ఉచితం...
ఎక్కడనుంచి వచ్చాయ్ ఈ డబ్బులు?
ఎన్ని లక్షల కోట్లు అవినీతి చేస్తే వచ్చాయి ఈ డబ్బులు?
మన రాష్ట్ర పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది.. వేల కోట్ల డబ్బులు పంపిణి చేసారు, ఓట్లు కొనటానికి. ఒక్క వోటుకి Rs.500 లేదా అంతకన్నా తక్కువ.. 
"పదవి వ్యామోహం, కులమతబెధాలు, భాషద్వేశాలు, వర్గ తారతమ్యాలు చెలరేగు వేళ.. ప్రతి మనిషి మరియొకని దోచుకునేవాడే.. తన లాభం, తన సౌక్యం చూసుకునేవాడే..స్వార్ధమే అనర్ధకారణం, దాన్ని చంపుటయే క్షేమదాయకం.."
 నేను మన దేశం మాత్రం గురించే చెప్పటం లేదు.. ప్రపంచం లో ఏ మూలకి వెళ్ళిన ఇదే పరిస్థితి.. అందుకే అన్నారేమో మహాకవి శ్రీశ్రీ., ఒక్క జాతి కోసం కాదు ప్రపంచం కోసం తన ఘోష ఇలా...

                " నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలు పోతాను
                  నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుకమిచ్చి మ్రోస్తాను...
                  నేను సైతం ప్రపంచాజ్యపు తెల్లరేఖయ్ పల్లవిస్తాను.
                  నేను సైతం.. నేను సైతం..బ్రతుకుబాటకు గొంతు కలిపేను
                  సకలజగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాక...
                  ప్రతిమనిషికి జీవనంలో నందనం వికసించుదాక..
                  నేను సైతం.. నేను సైతం...నేను సైతం....నేను సైతం"

అవినీతి.. బంధుప్రీతి, చీకటి బజారు.. అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు..?
మన దేశ ప్రజలు ఎలా ఇలా డబ్బులుకి ఓట్లు అమ్ముకుంటున్నారు .. ఆలోచించలేర.. ఒక్కసారి?
దేశ భవిత యువతపై  ఆధారపడి ఉంది అంటారు... మరి మన దేశ యువత పరిస్థితి ఏంటి? 
నాకు ఇంకా గుర్తు మూడు సంవత్సారాల క్రితం..  గాంధి జయంతి ఆ రోజు.. ఒక TV చానెల్ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసింది.. అందులో భాగంగా కొంతమంది యువతని గాంధి గురించి ప్రశ్నించింది.. అలా ఒక బైక్ మీద వెళ్తున్న ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి వెళ్తున్న బండి ఆపి అడిగారు..గాంధి గురించి అండ్ ఆయన జన్మదిన రోజు చెప్పమని.. వాళ్ళు ఆ ప్రశ్నకి ఇచ్చిన సమాధానం "మాకు తెలియదు" అండ్ దట్ గర్ల్ సైడ్ " I THINK ITS IN ఆగష్టు OR SOME OTHER MONTH" మేము పనిలో వెళ్తున్నాం.. మమ్మల్ని డిస్టర్బ్ చేయద్దు.. మీ సోది ప్రోగ్రామ మీరును అని.. అని ఆ TV చానెల్ వాల్నే బెదిరించింది.. 
ఛి ఛి.. ఇంతకంటే సిగ్గు చేటు లేదు..
గురజాడ గారు అన్నట్టు.. "దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్.." 
 సో దేశం బాగుపడాలి అంటే ముందు ప్రజలు మారాలి..తరువాత నాయకులూ మారతారు.. 
అవినీతి నిర్మూలన కోసం అన్న హజారే లాంటి వ్యక్తులు చేసే పోరాటానికి నేను పూర్తిగా మద్దతు ఇస్తాను. దేశప్రగతికి నావంతు నేను చేసే బాధ్యతా ఇదే..
అంతకంటే ఏమి చేయలేని ఒక సామాన్య, మధ్యతరగతి మనిషిని నేను.. చేతాకని వ్యవస్థలో.. చేతకాని సామాన్యున్ని...
"తల్లి..!! భారతమాత...!!! క్షమించు అమ్మా... నీ బాగు కోసం ఏమి చేయలేని అభాగ్యున్ని..."
నాలాంటి అభాగ్యులు ఎదురుచూసే మార్పు ఎప్పుడు సంభవిస్తుంది.?
"పతితులార... బ్రష్టులార..బాధాసర్పధ్రష్టులార.. దగాపడిన తమ్ములార..ఏడవకండి ఏడవకండి..
జగనాద రథచక్రాలు వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. రథచక్ర ప్రళయఘోషతో భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను.. "
అన్నారు శ్రీశ్రీ.. ఎప్పుడు వస్తాయ్..? ఆ రథచక్రాలు మరి?

Wednesday, April 6, 2011

నవరసాల్లో చావు గోల

రేయ్. అనుదీప్...! నీకొక మంచి టప రాసిపెట్టాలి అని డిసైడ్ అయ్యానురా.. - పాండు
ఏంటిరా... మందు కాని కొట్టావ లేక బ్రెయిన్ పని చేయటం స్టార్ట్ గాని చేసిందా.? టప రాస్తాను అంటున్నావ్... - అనుదీప్
ఏడ్చావ్ లే..! పింజారి మొకమోడ ..! నేను మందు తాగటం ఏంటి... ? నా బుర్ర ఎప్పుడు షార్ప్... పట్టుకొని చూడు చెయ్ తెగుద్ది... - పాండు
వద్దులేరా బాబు.. ఇప్పుడు నా చేయి కోసుకోలేను కాని.. ఎప్పుడు అయిన కూరగాయలు తరగటానికి కత్తి దొరక్కపోతే నీ తల వాడుతాను.. - అనుదీప్
ఏంటి వెటకారంనా? -- పాండు
కాదురా .. గొడ్డు కారం ... - అనుదీప్
సరే ఇంతకి ఏంటి ఆ టప పేరు? - అనుదీప్
" నవరసాల్లో చావు గోల ".. ఎలా ఉంది టైటిల్ ? -- పాండు.
"నవరసాల్లో చావు గోల" ఒరేయ్ అడివి మనిషి..! శుభమాంటూ ఏదో నేను బ్లాగ్ మొదలెడితే ఈ చావు గోల ఏంటిరా..? అక్కు పక్షి, నిరక్షర కుక్షి, అజ్హ్నాన కాక్షి... - అనుదీప్
టైటిల్ నే ఇలా ఉంటె.. ఇంకా విషయం ఎలా ఉంటది.. ఎందుకులేర బాబు LITE తీసుకో ఎందుకొచ్చిన గోల  - అనుదీప్
రేయ్.. రేయ్ అలా కాదురా .. మొత్తం నా యొక్క ఆలోచనల్ని రంగరించి ఒక కాన్సెప్ట్ అనుకున్న సో నువ్వు కాదనకూడదు.. ప్లీజ్ రా -- పాండు
సరే..!!  తగలడు.. ఎం చేస్తాం.. కర్మ అలా ఏడ్చింది నాది.- అనుదీప్
ఆ మాట మీద ఉండు.. పీక మీద బ్లేడ్ లా కోసుకుపోత, అరటి పండుని కోసినట్టు కోస్తా టప --- పాండు
 హే ఫ్రెండ్స్ ఎక్కువ ఉపోద్గాతం లేకుండా సీదా టప లోకి వెళ్లిపోదాం.. ఈ టప చదివితే నేను ఏంటో మీకే తెలుస్తుంది. " - పాండు
"""దేశ బాష లందు తెలుగు లెస్స అని ఏ ముహూర్తాన అన్నారో కానీ రాయలు వారు... నిజంగా నాకు అనిపిస్తుంది... తెలుగు బాష గద్య భాగానికి పద్య భాగానికి సరిగ్గా సరిపోతుంది. వాచకంలో తెలుగు బాష గొప్పధనమే వేరు.కొన్ని పదాల అమరిక బలే ఉంటుంది తెలుగులో.  తెలుగు భాషలో కొన్ని పదాలు వాడకం కేవలం మనకే సొంతం అని అనిపిస్తుంది. మచ్చుకి ఇప్పుడు మనం ఒక పదవాడకం తీసుకుందాం. అదే "చావు".

వీడేంటిరా బాబు.. తెలుగు, అది ఇది అంటాడు మళ్ళి చావు గురించి చెబుతాను అంటాడు ఏంటి అనుకుంటున్నారా...!! వస్తున్నా... అక్కడికే వస్తున్నా... చావు అనే పదాన్ని నాకు తెలిసి, తెలుగు లో ఉపయోగించినంతగా ఎక్కడ ఉపయోగించరేమో .. అని నా అభిప్రాయం.
అది ఏ రకమైన ఫీలింగ్ అయిన సరే....! విషాదం, ఆనందం, కోపం.... వగైరా...వగైరా...
నేను అనుకోవటం, నవరసాల్లో చావు అనే పదం బాగా వాడుకోవచ్చు అని.
విషాద సమయాన్నే తీసుకుందాం:  " చీ... చీ.... ఈ నరకం నా వల్ల కాదు. ఈ బాధ పడేకంటే ఇంత విషం మింగి చావటం నయం. " అని వింటుంటాం.. ప్రతి ఒక్క మనిషికి విషాద సమయాల్లో ఆకరికి వచ్చే పదం చావు నే..!
విషం మింగి చావటం లేదా ఇంకోవిధంగా చావాలని అనిపిస్తుంది... ఆత్మ్యహత్య. ఇవి అన్ని చివరికి వచ్చేది చావు కే...
ఆనంద సమయాల్లో కూడా మనం చావు ని వాడుకోకుండా ఏ వాఖ్యం పూర్తి చేయలేం అనిపిస్తుంది.
ఎవరు అయిన మంచి జోక్ చెప్పారు అనుకోండి... ఆ జోక్ పొట్ట చెక్కలు అయ్యేలా ఉంది అనుకోండి.. మనం ఏమి అంటాం.." రేయ్ ఆపరా బాబు.. నవ్వలేక చచ్చిపోతున్న..!! కడుపు చెక్కలు అయేలా ఉంది..."
ఈ బాగోద్వేకం లో కూడా మనం చావు లేకుండా పూర్తి చేయలేకపోయాం.
బాధలో ఉన్నాం అంటే అనుకోవచ్చు ఆనందం లో కూడా ఇదే...
ఏదైనా..! జరగరానిది జరిగింది అనుకోండి.. " చచ్చానురా. దేవుడా..!! ఇలా ఐపోయింది ఏంటి..? ఇప్పుడు ఎం చేయాలి..?" ఇక్కడ కూడా అదే చావు.
కోపంలో అయితే ఇంగ తిరుగే లేదు... చావు లేకుండా ఒక్క వాఖ్య కూడా చేయలేం అంటే నమ్మండి...
 ఉదాహరణకి : " రేయ్...వీర వంకరరెడ్డి చచ్చావుర నువ్వు...!! ఐపోయావ్ నా చేతిలో... అంతే... ఇగ..ఆకరిసారి ఇంటికి ఫోన్ చేసుకో..నువ్వు ఎలుకోనేదానితో కడసారి మాట్టాడుకో... నువ్వో...నేనో..తేల్చుకుందాం....ఏ సెంటర్ అయిన రెడీ.. ఎంత మంది అయిన తెచ్చుకో..సింగల్ గానే వస్తా...!!  ఎవడికి ఎంత దమ్ము ఉందో చూద్దాం. రేపు తెల్లారేసరికి   నీ శవం చూస్తా..! ఇది నా ఆన."
ఇది..ఎదో... ఫాక్షన్ సినిమాలో డైలాగ్ లా ఉంది కదా... మరి అంతే కదా... అంటే చావు గురించి చెబుతున్నాం... రౌద్రం లో కాస్త బలంగా ఉండాలి అని... కాపీ కొట్టేసాను...
కాదు కాదు కాపీ తో పాటు కొంచం టీ కూడా కలిపి కొట్టాను.
సినిమా డైలాగ్ అంటే గుర్తుకు వచ్చింది అండి. మన సినిమాల్లో ఈ చావు మీద డైలాగ్లు అని BUMPER హిట్. రవితేజ విక్రమార్కుడు సినిమానే తీసుకోండి, " చావు అంటే బయపడటానికి అల్లాటప్ప గల్లి రౌడీని కాదుర... రాథోడ్..  విక్రం రాథోడ్. భయం నాకు కాదుర..! చావుకి.. అందుకే పిచ్చికుక్కలా నా వెనకాలే తిరుగుతుంది.." ఊహూ.. ఈ డైలాగ్ వినగానే ఒకటే ఈలలు, కేకలు ధియేటర్లో.. 
ఇంకొక సినిమాలో మన బాలయ్య బాబు... డైలాగ్ ఏంటి.. ఆహ ఏంటి అసలు.. మనందరి ఫేవరేట్ " కత్తితో కాదురా..! కంటి చూపుతో చంపేస్తా.." మోస్ట్ పవర్ ఫుల్ డైలాగ్ ఇది..
సినిమాల్లో ఆవేశం కట్టలు తెంచుకున్న హీరో, చంపేది విలన్నే.....!!
నవరసాల్లో భీబత్సం మరియు భయానకం లో కూడా చావు దే కీలక పాత్ర...
ధక్షయజ్ఞంలో వీరభద్రుడు నానా భీభత్సం చేసాడు అంటారు..  ఇంతకి ఏంటా... భీబత్సం... ధక్షరాజు సేనల్ని అందరిని చంపటమే.
ఈ లోకంలో.... చావు కి బయపడని వాడు లేడు, అంటే అతిశయోక్తి కాదు ఏమో .. !
సో ఈ రెండు రసాలలో కూడా చావు యొక్క ప్రాముక్యత అవగతం అయినది కదా...
 ఇంగ మనకి మిగిలినవి .. శృంగారం, ఆశ్చర్యం, సహనం...
శృంగారం..  : నెచ్చెలి విసిరే వాలు చాపు తగిలితే చాలు ... చచ్చారే కుర్రకారు...  అందుకేనేమో... ఓ సినిమాలో "చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరె హాయ్..." అని పాట పెట్టారు... అమ్మాయిలు చూసే కొంటె  చూపు వామ్మో తట్టుకోవటం చాలా కష్టం అని అనిపిస్తుంది... అమ్మాయిలు ఒక నవ్వుతో కరుణిస్తే చాలు ఈ క్షణమే చచ్చిపోతం  అనే పిల్లకాయలు ఎంత మంది లేరు చెప్పండి.. శృంగారంకి ఇంకొకరకం గా చెప్పే కామం వల్ల ఎన్ని అనర్ధాలు జరిగాయ్... పెద్ద పెద్ద యుద్ధాలు జరిగి... ఎంతో మంది చచ్చారు... """"
ఇదే నేను చెప్పదలుచుకున్న చావు గోల... నవరసాలు అండ్ చావు ప్రాముక్యత... తెలుగులో చావు ఎంతగా అమరిపోయిందో చూసారుగా..
మిత్రులు అందరికి నా యొక్క ఈ చావు పురాణం  బాగా అవగతం అయినది అనుకుంట... మరి ఇక సెలవ పుచ్చుకుంట నేను టపా నుంచి..
                              ====  X ====
రేయ్ పింజారి..!! మరి మిగతా రెండు ఎందుకు వదిలేసావ్  - అనుదీప్
 ఏవి ? -- పాండు
అవేరా..! సహనం ఇంకా ఆశ్చర్యం -  అనుదీప్
ఏమోరా..! నాకు ఇంతవరకే వచ్చు అంతవరకే రాసాను..నీకు తెలిస్తే నువ్వు రాసుకో.. ఇలా అన్ని అడిగితే కష్టం నాన్నా..  BYE మరి -- పాండు.
ఓసి నీ అఘాయిత్యం కూల.. నేను ఎక్కడి నుంచి రాయను.. కాన్సెప్ట్ నీది కాబట్టి నువ్వే చూడాలి నాకు ఎలా తెలుస్తుంది.. - అనుదీప్
ఫ్రెండ్స్, చూసారుగా..!! మన పాండు గాడు ఎలా వదిలేసాడో, సో మీలో ఎవరికీ అయిన చావు ని ఆశ్చర్యం ఇంకా సహనం లో ఎలా వ్యక్తపరచాలో తెలిస్తే మా పాండు గాడికి చెప్పగలరు అని మనవి. సరే మిత్రులారా సెలవు తీసుకుంటా ఇగ.. - అనుదీప్
"ఈ పాండు గాడిని ఇరగ తన్నాలి..ఇంకొకసారి టపా అంటే చంపుత వాడిని .." - అనుదీప్